Talk:Vajjala Shiva Kumar

Page contents not supported in other languages.
From Wikipedia, the free encyclopedia

External links modified[edit]

Hello fellow Wikipedians,

I have just added archive links to one external link on Vajjala Shiva Kumar. Please take a moment to review my edit. If necessary, add {{cbignore}} after the link to keep me from modifying it. Alternatively, you can add {{nobots|deny=InternetArchiveBot}} to keep me off the page altogether. I made the following changes:

When you have finished reviewing my changes, please set the checked parameter below to true to let others know.

This message was posted before February 2018. After February 2018, "External links modified" talk page sections are no longer generated or monitored by InternetArchiveBot. No special action is required regarding these talk page notices, other than regular verification using the archive tool instructions below. Editors have permission to delete these "External links modified" talk page sections if they want to de-clutter talk pages, but see the RfC before doing mass systematic removals. This message is updated dynamically through the template {{source check}} (last update: 18 January 2022).

  • If you have discovered URLs which were erroneously considered dead by the bot, you can report them with this tool.
  • If you found an error with any archives or the URLs themselves, you can fix them with this tool.

Cheers.—cyberbot IITalk to my owner:Online 10:37, 15 February 2016 (UTC)[reply]

వఝల సాంబశివశర్మ[edit]

ఆయన గళం విప్పితే రమణీయం కమనీయం . మాట్లాడినా భజన చేస్తూ వ్యాఖ్యానించినా, హార్మోనియం మెట్ల మీద స్వరాలను నర్తింప చేస్తూ విభిన్న శైలిలో హరికథా గానం చేసినా అది రసరమ్యం. ప్రహతంగా, స్వచ్ఛందంగా శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో నిత్య సుప్రభాత గాయకులుగా , నిద్రిస్తున్న నా ప్రపంచం కోసం కదిలి రమ్మని స్వామి వారికి మేలుకొలుపులు పాడి తన చరమాంకం వరకు స్వామి సేవలో కృతార్థులైన సార్ధక జన్ముడు బ్రహ్మశ్రీ వఝల సాంబశివశర్మ గారు. రాధేశ్యాం రామాయణం హరికథా ప్రవాచకులుగా తెలంగాణలోని పలు పట్టణాలలో క్షేత్రాలలో ఆయన బహు ప్రసిద్ధులు. ప్రతి సంవత్సరం నెల రోజులు ధర్మపురి క్షేత్రంలో రామాయణ ప్రవచనంచేసి 1954 లో అసంఖ్యాక భక్త బృందం చే దివ్య పట్టాభిషేక సత్కారాలు పొందిన విద్వత్ శిరోమణి ఆయన. గణేశ నవరాత్రులు, శ్రీరామ అ నవమి ఉత్సవాల సందర్భంలో బోధన్ కామారెడ్డి నిజామాబాద్ వరంగల్ సిరిసిల్ల వంటి ఎన్నో పట్టణాలలో ఉత్తర భారతీయ ఫణితిలో హరికథా గానం చేసి విశేష సన్మానాలు పొంది గౌరవింప బడిన నవ్య హరికథా విద్వాంసులు.

సంస్కృతాంధ్ర హిందీ భాషా పండితులు ఆదర్శ అధ్యాపకులు. మంటప హనుమాన్ భజన మండలిని స్థాపించి మూడు దశాబ్దాలు తన సంకీర్తనలతో రాజరాజేశ్వర స్వామి వారికి, శ్రీరామచంద్రమూర్తికి, జగన్మాత లకు స్వర్ణ నీరాజనాలు సమర్పించి అశేష భక్త సమాజానికి ముక్తి మార్గ నిర్దేశం చేసిన ధన్యజీవి. శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి క్షేత్ర వైభవం పై లక్ష్మీ గణపతి, శ్రీ రాజరాజేశ్వరీ దేవి, క్షేత్రస్థ దేవాది దేవతలపై వేలాది కీర్తనలు రచించి స్వరకల్పన చేసి శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో అట్టి నిత్య భగవన్నామ సంకీర్తనలను తన సుమధుర గంభీర శ్రావ్య స్వరంతో ప్రతి నిత్యము ఆలపించి తరించిన భాగవతోత్తమ్ముడు ఆయన. 1924 సం.లో వఝల రాధా కృష్ణ శాస్త్రి, కిష్టబాయమ్మ దంపతులకు జన్మించి.. సంస్కృతం హిందీ ఉర్దూ భాషలలో అనర్గళ పాండిత్యాన్ని సొంతం చేసుకున్నారు. నిజాం నిరంకుశ ప్రభుత్వంపై , రజాకార్ల ఉద్యమానికి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో చురుకైన పాత్ర పోషించినారు. ఆనాటి యువతరాన్ని సమీకరించి, వ్యాయామంలో శిక్షణనిచ్చి, ప్రోత్సహించి సంసిద్ధం చేసి ఎన్నో నిరసన పోరాటాలలో పాల్గొన్న సమరయోధుడు సాంబశివ శర్మగారు. 1953 లో కోటి సుల్తాన్ బజార్ వేదిక పై ఆయన ఆలపించిన "హిల్ గయా తఖ్త్ సుల్తానీ‌" పాట ట సభను ఉత్తేజితం చేసింది. 1939 లో పీవీ నరసింహారావు గారి నాయకత్వంలో సాగుతున్న స్వాతంత్ర పోరాట స్ఫూర్తితో వేములవాడ లో తొలితరం కాంగ్రెస్ తొలి సభ్యుడిగా చేరి తన దేశభక్తిని చాటుతూ గాంధీ టోపీ ఖద్దరు ధోవతి కండువా వాస్కో టు ఆహారంగా ధరించి జీవితపు చివరి దశ వరకు గాంధేయవాదిగా జీవితాన్ని గఱపిన మహనీయుడు. కుల వివక్ష, జాతీయ సంస్కరణలు, భారత స్వాతంత్ర్య పోరాటం, ఆదర్శ వివాహాలు, వంటి ఎన్నో సందేశాలతో పలు వేదికలపై నాటకాలు ప్రదర్శించి స్వాతంత్ర పోరాటేచ్ఛను రగిల్చిన సమరయోధుడు సాంబశివశర్మ. 1940 దశకం లో వేములవాడ తొలితరం రంగస్థల నాటకాల నిర్వహణలో ప్రదర్శనల్లో భాగమై మధురకవి మామిడిపల్లి సాంబశివశర్మ గారితో రంగస్థల వైభవాన్ని ప్రదీప్తింప చేసిన కళాకారులు ఆయన. ప్రతాప రామయ్య, కేశన్నగారి రామయ్య,సాంబకవి, వంటి వారితో తొలి స్త్రీ పాత్రధారిగా సత్య భామ ఊర్వశి రుక్మిణి వంటి గొప్ప పాత్రలకు జీవం పోసి ఆకట్టుకొని రసజ్ఞుల హృదయాలలో చెరగని స్థానం సంపాదించుకున్న రంగస్థల నటుడు. ఎన్నో భారతీయ సంస్కృతికి సంబంధించిన వ్యాసములు ప్రముఖ దిన పత్రికల ప్రత్యేక అనుబంధాలలో ప్రచురింపబడి ' సంస్కృతి - సంప్రదాయం' పేర సంకలనం చెయ్యబడి మన్ననలకు పాత్రమైనాయి. కీ.శే.డా.సుబ్రహ్మణ్యం వంటి ప్రముఖులతో వేములవాడ పట్టణంలో తొలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థాపించడం కోసం ఉద్యమించారు. ఆ రోజుల్లో దాని నిమిత్తం ప్రభుత్వ ఉత్తర్వు వెలువడేలా తేజ్ నారాయణ్ వంటి రాష్ట్ర స్థాయి అధికారులపై‌ ఒత్తిడి తెచ్చి సాధించిన సాధకుడు. బ్రాహ్మణ కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీసి వీధుల పాలు చేస్తున్న ఆనాటి 'మామ్ లా' గుత్తేదారు వ్యవస్థలను నిరసిస్తూ ఈ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం నిర్వహణను ప్రభుత్వపరం అయ్యేలా 'అమానీ' కోసం విశేష కృషి సలిపిన దార్శనికుడు శర్మ గారు. శ్రీ రాజరాజేశ్వర నామ సంకీర్తనలు, రాజన్న భక్తి పాటలు, శ్రీ గణపతిం భజే, శ్రీ రాజరాజేశ్వర నామ సంకీర్తనామృతం, మంగళహారతులు, మరియు సంస్కృతి సంప్రదాయం వ్యాస సంకలనం వంటి గ్రంధాలను వెలువరించి అశేష జనం అభిమానాన్ని చూరగొన్నారు. 2008వ సంII ఆషాడ బహుళ ఏకాదశి రోజు శివసాయుజ్యం పొందారు. 2009-2015 వరకు వారి పేర శ్రీభాష్యం విజయసారథి, దోర్బల విశ్వనాథ శర్మ, కోవెల సుప్రసన్నాచార్య, అష్టకాల నరసింహ రామశర్మ , అత్తలూరి మృత్యుంజయ శర్మ గారి వంటి ఎందరో పండితులకు విశిష్ట ఆధ్యాత్మిక సేవా పురస్కారాలు అందిస్తూ ప్రేరణాస్రోత మైన వారి ఆశయాలను కొనసాగిస్తూ ఉన్నారు. Vajjala Shiva Kumar (talk) 10:56, 1 April 2021 (UTC)[reply]